తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు నేడు కన్నుమూశారు.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.
తిరుమలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీలో 150మందికిపైగా కరోనా సోకగా.. 18మంది అర్చకులు వైరస్ బారినపడ్డారు. అంతేకాదు ఆలయ పెద్ద జీయంగారికి కూడా పాజిటివ్ తేలడం కలకలంరేపింది.
టీటీడీలో అర్చకులకు కరోనా సోకినందున దర్శనాలు నిలిపివేయాలని ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కోరిన విషయం తెలిసిందే. మరో వైపు టీటీడీ కూడ దీనిపై దృష్టి సారించింది.
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు నేడు కన్నుమూశారు.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.
తిరుమలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీలో 150మందికిపైగా కరోనా సోకగా.. 18మంది అర్చకులు వైరస్ బారినపడ్డారు. అంతేకాదు ఆలయ పెద్ద జీయంగారికి కూడా పాజిటివ్ తేలడం కలకలంరేపింది.
టీటీడీలో అర్చకులకు కరోనా సోకినందున దర్శనాలు నిలిపివేయాలని ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కోరిన విషయం తెలిసిందే. మరో వైపు టీటీడీ కూడ దీనిపై దృష్టి సారించింది.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
01 Mar 2021
02 Mar 2021