ఆంధ్ర ప్రదేశ్ : కరోనా మహమ్మారి బెడద దేవుళ్ళకు కూడా తప్పడం లేదు. కరోనా వ్యాప్తి అధికం అవుతుండడంతో దర్శనాలు నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆంధ్ర ప్రదేశ్లో కూడా కరోనా కేసులు ఎక్కువ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అన్నవరం ఆలయంలో కూడా 50 మందికి కరోనా నిర్ధారణ అవడంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని నిర్ధారించారు. ఈ మేరకు దేవస్థానం ఈవో త్రినాథరావు ఓ ప్రకటన చేసారు. స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా ఈ నెల 11 న మరో 250 కి కూడా పరీక్షలు చేసారు. ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. ఈ పరిస్థితి లో దర్శనాలను నిలిపివేశారు. మరిన్ని వార్తలు చదవండి : ఒక్కరోజే పదివేల కరోనా కేసులు..భారత్ లో మహమ్మారి భీబత్సం..!
ఆంధ్ర ప్రదేశ్ : కరోనా మహమ్మారి బెడద దేవుళ్ళకు కూడా తప్పడం లేదు. కరోనా వ్యాప్తి అధికం అవుతుండడంతో దర్శనాలు నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆంధ్ర ప్రదేశ్లో కూడా కరోనా కేసులు ఎక్కువ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అన్నవరం ఆలయంలో కూడా 50 మందికి కరోనా నిర్ధారణ అవడంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని నిర్ధారించారు. ఈ మేరకు దేవస్థానం ఈవో త్రినాథరావు ఓ ప్రకటన చేసారు. స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా ఈ నెల 11 న మరో 250 కి కూడా పరీక్షలు చేసారు. ఇంకా ఫలితాలు విడుదల కాలేదు. ఈ పరిస్థితి లో దర్శనాలను నిలిపివేశారు. మరిన్ని వార్తలు చదవండి : ఒక్కరోజే పదివేల కరోనా కేసులు..భారత్ లో మహమ్మారి భీబత్సం..!
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox