ఆంధ్రప్రదేశ్ : ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదిరి, ఒక రకంగా మాట్లాడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ అభిప్రాయం మరొకలా వుందంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. దీనితో ఒకరకంగా సుజనాకు సొంత పార్టీనే షాక్ ఇచ్చినట్లయింది.
ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్కు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని సుజనా చౌదరి అన్నారు. ఆర్టికల్ 254ప్రకారం గవర్నర్ ఆ బిల్లును కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం లేదన్నారు. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5,6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు.
గవర్నర్ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరని సుజనా అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ ఆమోదించకుండా రాజధాని విభజన బిల్లును గవర్నర్కి పంపడమే రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రానిదే తుది నిర్ణయం అన్నారు. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించిందని గుర్తు చేశారు.
సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు’అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదిరి, ఒక రకంగా మాట్లాడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ అభిప్రాయం మరొకలా వుందంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. దీనితో ఒకరకంగా సుజనాకు సొంత పార్టీనే షాక్ ఇచ్చినట్లయింది.
ఏపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్కు పంపించడం రాజ్యాంగ విరుద్ధమని సుజనా చౌదరి అన్నారు. ఆర్టికల్ 254ప్రకారం గవర్నర్ ఆ బిల్లును కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం లేదన్నారు. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5,6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు.
గవర్నర్ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరని సుజనా అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ ఆమోదించకుండా రాజధాని విభజన బిల్లును గవర్నర్కి పంపడమే రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రానిదే తుది నిర్ణయం అన్నారు. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించిందని గుర్తు చేశారు.
సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు’అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021
16 Jan 2021