ఆంధ్రప్రదేశ్: గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా జగన్ రెడ్డి గారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకొచ్చాక 5వందలు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్లో భాగమా? నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది.
వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుఫానునష్టం తెలుస్తుంది.
గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా @ysjagan గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే!(1/4)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 28, 2020
మీ సాక్షి మీడియా ప్రకటనలు,భజన బ్యాచ్ నుంచి వాస్తవంలోకొస్తే అన్నదాతల ఆర్త నాదాలు వినపడతాయి.తాడేపల్లి గడప దాటి ప్రజల్లోకొస్తే జనం కన్నీళ్లు కనిపిస్తాయంటూ లోకేష్ ట్వీట్ చేసారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్: గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా జగన్ రెడ్డి గారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకొచ్చాక 5వందలు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్లో భాగమా? నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది.
వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుఫానునష్టం తెలుస్తుంది.
గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా @ysjagan గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే!(1/4)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 28, 2020
మీ సాక్షి మీడియా ప్రకటనలు,భజన బ్యాచ్ నుంచి వాస్తవంలోకొస్తే అన్నదాతల ఆర్త నాదాలు వినపడతాయి.తాడేపల్లి గడప దాటి ప్రజల్లోకొస్తే జనం కన్నీళ్లు కనిపిస్తాయంటూ లోకేష్ ట్వీట్ చేసారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021