జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు నిన్న తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాక్షసులను అంతమొందించే పనిలో పడిన తన కోసం కడప బ్యాచ్ ను దించాలనుకుంటున్నారని అన్నారు. తన పై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు. బాబాయిని చంపారు. ఇప్పుడు ఎంపీని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై ఇవాళ హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చెస్తానన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసినట్లు చెప్పారు.
తన గురించి ఎన్ని పోస్టర్లు వేసినా ఏం చేసినా రాష్ట్రానికి రానన్నారు. తానోక మహా యజ్ఞం చేపట్టానని, సర్పయాగమని, అది పూర్తయ్యే వరకు రానన్నారు. రూ. 1500 వందల కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూములు అమ్మాలని చూస్తున్నారని, త్వరలో రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నారట. ప్రజల భవిష్యత్తు వారి చేతిలో ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైసీపీని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేశా. నేను ముఖ్యమంత్రి రాముడని అనుకుంటున్నా. రావణుడని కొందరు అనుకుంటున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉంటే బావుంటుంది. తిరుపతిలో వైసీపీ నెగ్గడం ఖాయం. రెండు లక్షల మెజారిటీ వస్తుందని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు నిన్న తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాక్షసులను అంతమొందించే పనిలో పడిన తన కోసం కడప బ్యాచ్ ను దించాలనుకుంటున్నారని అన్నారు. తన పై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు. బాబాయిని చంపారు. ఇప్పుడు ఎంపీని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై ఇవాళ హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చెస్తానన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసినట్లు చెప్పారు.
తన గురించి ఎన్ని పోస్టర్లు వేసినా ఏం చేసినా రాష్ట్రానికి రానన్నారు. తానోక మహా యజ్ఞం చేపట్టానని, సర్పయాగమని, అది పూర్తయ్యే వరకు రానన్నారు. రూ. 1500 వందల కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూములు అమ్మాలని చూస్తున్నారని, త్వరలో రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నారట. ప్రజల భవిష్యత్తు వారి చేతిలో ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైసీపీని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేశా. నేను ముఖ్యమంత్రి రాముడని అనుకుంటున్నా. రావణుడని కొందరు అనుకుంటున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉంటే బావుంటుంది. తిరుపతిలో వైసీపీ నెగ్గడం ఖాయం. రెండు లక్షల మెజారిటీ వస్తుందని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021