ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శీతాకాలం సమావేశాలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యాయి. ఐదు రోజుల పాటు మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 4 వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగుతాయి. ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను వైఎస్ఆర్సిపి ప్రవేశ పెట్టింది.
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతా మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గత నెల ప్రకటించారు. ఆమె తన రాజీనామా లేఖను చైర్మన్ కు పంపించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతోందని అందుకే, ఆ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని పోతుల సునీతా ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారంటూ పోతుల సునీతా పలు విమర్శలు గుప్పించారు. మరో వైపు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారని ప్రసంగాలు కురిపించారు. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో, పోతుల సునీతా రాజీనామాను మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శీతాకాలం సమావేశాలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యాయి. ఐదు రోజుల పాటు మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 4 వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగుతాయి. ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను వైఎస్ఆర్సిపి ప్రవేశ పెట్టింది.
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతా మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గత నెల ప్రకటించారు. ఆమె తన రాజీనామా లేఖను చైర్మన్ కు పంపించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతోందని అందుకే, ఆ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని పోతుల సునీతా ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారంటూ పోతుల సునీతా పలు విమర్శలు గుప్పించారు. మరో వైపు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారని ప్రసంగాలు కురిపించారు. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో, పోతుల సునీతా రాజీనామాను మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
20 Jan 2021