ఆంధ్రప్రదేశ్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ తన చుట్టూ ఉండే కట్టప్పలను గుర్తించాలని లేదంటే ప్రమాదమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. అవినీతిని ఏమాత్రం ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీకు పేరుంది, కానీ మీ పక్కనే ఉంటూ అవినీతికి పాల్పడుతున్న కట్టప్పను మీరు పట్టుకుని తీరాలి. సినిమా కాబట్టి బాహుబలిని కట్టప్ప పొడిచేశాడు. ఈ కట్టప్పను మీరు కనిపెట్టాలి .
మీ పైనే రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మీ పై ఉన్న విశ్వసనీయతను కాపాడుకోవాలి అంటే అతి త్వరలో ఆ కట్టప్పను పట్టుకుని శిక్షించాలి. అలాంటి కట్టప్పలు చాలా మందే ఉన్నారు. మీ పక్కన ఉంటూ పనికిరాని మాటలు చెబుతూ, వారిపై వీరిపై చాడీలు చెబుతూ ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్న వారిని మీరు కనిపెట్టి శిక్షించాలి అని రఘురామ రాజు వ్యాఖ్యానించారు. మరిన్ని వార్తలు చదవండి : జగన్ కు లేఖ రాసిన రఘురామకృష్ణం రాజు..!