ఆరోగ్య వార్తలు : సామజిక జీవనంలో కష్టమేమొచ్చినా ముందు నిలబడేది పోలీస్ లే తమ జీవితాలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారు. తాజాగా ప్లాస్మా దానాలపై ఇటు హైదరాబాద్ పోలీస్ లు అటు ఆంద్ర పోలీస్ లు కూడా అవగాహనను కల్పిస్తున్నారు. ప్లాస్మా దానం వలన కరోనా మహమ్మారి నుంచి రక్షించగలుగుతున్నామన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి ఇతరులకు ఆదర్శం గా నిలవాలని పోలీస్ లు పిలుపునిస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ పోలీస్ ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిఐడి ప్రధాన కార్యాలయంలో కోస్టల్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ch. సూరిబాబు గారికి asymptomatic(లక్షణాలు లేకుండా) పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆయన కోలుకున్న తరువాత వైరస్ కు గురైన వారికి ఎవరికైనా రక్తంలో ప్లాస్మా అవసరం ఉంటే దానం చేయడానికి తను సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. అయితే విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణ బాధితుడు కొవిడ్ వైరస్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ప్లాస్మా అవసరాన్ని ఇన్స్పెక్టర్ సూరిబాబు గుర్తించారు. వెంటనే ఆయన బాధితుని వద్దకు వెళ్లి A+ రక్తం - ప్లాస్మా దానం చేసారు. ప్రాణాపాయం లో ఉన్న సత్యనారాయణకు ప్లాస్మా దానం చేసిన ఇన్స్పెక్టర్ Ch. సూరిబాబుకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి ( బాలు ఆరోగ్యం పై బులెటిన్.. పరిస్థితి విషమం..!)
ఆరోగ్య వార్తలు : సామజిక జీవనంలో కష్టమేమొచ్చినా ముందు నిలబడేది పోలీస్ లే తమ జీవితాలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారు. తాజాగా ప్లాస్మా దానాలపై ఇటు హైదరాబాద్ పోలీస్ లు అటు ఆంద్ర పోలీస్ లు కూడా అవగాహనను కల్పిస్తున్నారు. ప్లాస్మా దానం వలన కరోనా మహమ్మారి నుంచి రక్షించగలుగుతున్నామన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి ఇతరులకు ఆదర్శం గా నిలవాలని పోలీస్ లు పిలుపునిస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ పోలీస్ ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిఐడి ప్రధాన కార్యాలయంలో కోస్టల్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ch. సూరిబాబు గారికి asymptomatic(లక్షణాలు లేకుండా) పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆయన కోలుకున్న తరువాత వైరస్ కు గురైన వారికి ఎవరికైనా రక్తంలో ప్లాస్మా అవసరం ఉంటే దానం చేయడానికి తను సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. అయితే విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణ బాధితుడు కొవిడ్ వైరస్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ప్లాస్మా అవసరాన్ని ఇన్స్పెక్టర్ సూరిబాబు గుర్తించారు. వెంటనే ఆయన బాధితుని వద్దకు వెళ్లి A+ రక్తం - ప్లాస్మా దానం చేసారు. ప్రాణాపాయం లో ఉన్న సత్యనారాయణకు ప్లాస్మా దానం చేసిన ఇన్స్పెక్టర్ Ch. సూరిబాబుకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి ( బాలు ఆరోగ్యం పై బులెటిన్.. పరిస్థితి విషమం..!)
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox