ఆంధ్రప్రదేశ్ :ఎమ్మెల్యే రాపాక జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచారన్న ఆనందం జనసేనలో కొందరికి కూడా నిలవలేదు. నెలలోపే రాపాక తన రూటు మార్చుకున్నారు. వైసీపీకి నీరాజనాలు పలికారు. తానూ పవన్ మద్దతు వల్ల గెలవలేదని, ప్రజల్లో తనకున్న పలుకుబడి కారణంగానే గెలిచానని పలు సందర్భాల్లో రాపాక స్పష్టం చేసారు.
చివరకు పార్టీ అధిష్టానం ఆదేశించిన ఆదేశాలను సైతం పక్కన పెట్టారు. జెండా జనసేనది ఎజెండా వైసీపీది అన్న చందంగా ఆయన కొనసాగారు. ఈ క్రమంలో జనసేనాని కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఆయనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అయితే, రాజోలు ప్రజలు మాత్రం పార్టీ నాయకుడిని వీడలేదు. జనసేనా వెంటే ఉన్నారు. ఈ విషయాన్నీ రుజువు చేసుకోవడం కోసం అనువైన సమయం కోసం ఎదురుచూసారు.
పంచాయితీ ఎన్నికలతో ఆ సమయం రానే వచ్చింది. రాజోలు నియోజక వర్గంలో అత్యధిక స్థానాలను జనసేన పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. రాపాక మాటలతో కొట్టిన దెబ్బకి రాజోలు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. వైసీపీకి మద్దతు పలికిన రాపాకకు రాజోలు ప్రజలు జనసేనకు అండగా నిలబడి షాకిచ్చారు. కూనవరం, అమలాపురం, అంతర్వేది, తూర్పుపాలెం, సఖినేటిపల్లి లంక, కాట్రేనిపాడు, ఈటుకూరు,కేశవాదాసుపాలెం, మేడిచర్ల పాలెం,టెకిశెట్టిపాలెం, పడమటిపాలెం,బట్టేలంక, రామరాజులంక వంటి పంచాయితీల్లో జనసేన అభ్యర్థులే గెలిచి చూపించారు. ఒక్క రాజోలు లోనే జనసేన మద్దతుదారులు 16 సీట్లు గెలుచుకుని, ఇదీ జనసేన సత్తా అని నిరూపించారు. మరిన్ని వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్ :ఎమ్మెల్యే రాపాక జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచారన్న ఆనందం జనసేనలో కొందరికి కూడా నిలవలేదు. నెలలోపే రాపాక తన రూటు మార్చుకున్నారు. వైసీపీకి నీరాజనాలు పలికారు. తానూ పవన్ మద్దతు వల్ల గెలవలేదని, ప్రజల్లో తనకున్న పలుకుబడి కారణంగానే గెలిచానని పలు సందర్భాల్లో రాపాక స్పష్టం చేసారు.
చివరకు పార్టీ అధిష్టానం ఆదేశించిన ఆదేశాలను సైతం పక్కన పెట్టారు. జెండా జనసేనది ఎజెండా వైసీపీది అన్న చందంగా ఆయన కొనసాగారు. ఈ క్రమంలో జనసేనాని కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఆయనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అయితే, రాజోలు ప్రజలు మాత్రం పార్టీ నాయకుడిని వీడలేదు. జనసేనా వెంటే ఉన్నారు. ఈ విషయాన్నీ రుజువు చేసుకోవడం కోసం అనువైన సమయం కోసం ఎదురుచూసారు.
పంచాయితీ ఎన్నికలతో ఆ సమయం రానే వచ్చింది. రాజోలు నియోజక వర్గంలో అత్యధిక స్థానాలను జనసేన పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. రాపాక మాటలతో కొట్టిన దెబ్బకి రాజోలు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. వైసీపీకి మద్దతు పలికిన రాపాకకు రాజోలు ప్రజలు జనసేనకు అండగా నిలబడి షాకిచ్చారు. కూనవరం, అమలాపురం, అంతర్వేది, తూర్పుపాలెం, సఖినేటిపల్లి లంక, కాట్రేనిపాడు, ఈటుకూరు,కేశవాదాసుపాలెం, మేడిచర్ల పాలెం,టెకిశెట్టిపాలెం, పడమటిపాలెం,బట్టేలంక, రామరాజులంక వంటి పంచాయితీల్లో జనసేన అభ్యర్థులే గెలిచి చూపించారు. ఒక్క రాజోలు లోనే జనసేన మద్దతుదారులు 16 సీట్లు గెలుచుకుని, ఇదీ జనసేన సత్తా అని నిరూపించారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
04 Mar 2021
04 Mar 2021
04 Mar 2021