ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్జెంట్గా పిచ్చాస్పత్రిలో చేర్పించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పూర్తిగా పిచ్చి పట్టిందని, ఆయన్ను అలాగే వదిలేస్తే రాష్ట్రానికి, ప్రజలకు కూడా హానికరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు నరకంలో కూడా చోటు లభించదని దుయ్యబట్టారు.
తాను మాట చెప్తే చేసి చూపిస్తానని సీఎం జగన్ అన్నారు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని, మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం అంశాలను అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.
టిడ్కో ఇళ్లపై అంత క్లియర్కట్గా మేము చెబితే, చంద్రబాబునాయుడు ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని సీఎం జగన్ అన్నారు. తాను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టామని, అయినా ఈ మనిషి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తన మాటలను ఎక్కడికక్కడ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఆయనకు బుర్ర ఏమైనా ఉందా? వాటీజ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్ అంటూ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్జెంట్గా పిచ్చాస్పత్రిలో చేర్పించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పూర్తిగా పిచ్చి పట్టిందని, ఆయన్ను అలాగే వదిలేస్తే రాష్ట్రానికి, ప్రజలకు కూడా హానికరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు నరకంలో కూడా చోటు లభించదని దుయ్యబట్టారు.
తాను మాట చెప్తే చేసి చూపిస్తానని సీఎం జగన్ అన్నారు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని, మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం అంశాలను అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.
టిడ్కో ఇళ్లపై అంత క్లియర్కట్గా మేము చెబితే, చంద్రబాబునాయుడు ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని సీఎం జగన్ అన్నారు. తాను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టామని, అయినా ఈ మనిషి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తన మాటలను ఎక్కడికక్కడ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఆయనకు బుర్ర ఏమైనా ఉందా? వాటీజ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్ అంటూ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021