ఆంధ్రప్రదేశ్ : అమరావతి లాంటి ప్రాజెక్టుని చంపేస్తుంటే ఒక్కోసారి కళ్ల వెంట నీరు వస్తుందనిటీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అనుభవించడానికి రాజధాని కట్టలేదన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి. 40ఏళ్ల రాజకీయం నాకు ఇంకా ఏం కావాలి? ఆరోగ్యం బాగుంటే మరో 10సంవత్సరాలు ఎక్కువ బతికుంటాను. అమరావతి నాకోసమేమీ కాదు. ఏదో రోజు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. ఈ రోజు చీకటి రోజు అని,నేను చెప్పిన మాట నిజమని భవిష్యత్లో అంతా ఒప్పుకుంటారు. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బిటెక్ రవి రాజీనామా..
వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
మూడు రాజధానులకు ఇది సమయం కాదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్
మూడు రాజధానులకు ఇది సమయం కాదని, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. 33వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ చెప్పారు. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని హామీ ఇచ్చారు.
తడి గుడ్డతో గొంతు కోయడమే : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు. రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, నయ వంచన, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులనేదే మోసమని, ఒకటే రాజధాని అని,ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని నర్సాపురం ఎంపీ చెప్పారు.
న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు.
అమరావతికి కట్టుబడి ఉన్నాం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని, రైతులకు మద్దతు ఇస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నిలబెట్టాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : అమరావతి లాంటి ప్రాజెక్టుని చంపేస్తుంటే ఒక్కోసారి కళ్ల వెంట నీరు వస్తుందనిటీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అనుభవించడానికి రాజధాని కట్టలేదన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి. 40ఏళ్ల రాజకీయం నాకు ఇంకా ఏం కావాలి? ఆరోగ్యం బాగుంటే మరో 10సంవత్సరాలు ఎక్కువ బతికుంటాను. అమరావతి నాకోసమేమీ కాదు. ఏదో రోజు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. ఈ రోజు చీకటి రోజు అని,నేను చెప్పిన మాట నిజమని భవిష్యత్లో అంతా ఒప్పుకుంటారు. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బిటెక్ రవి రాజీనామా..
వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
మూడు రాజధానులకు ఇది సమయం కాదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్
మూడు రాజధానులకు ఇది సమయం కాదని, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. 33వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ చెప్పారు. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని హామీ ఇచ్చారు.
తడి గుడ్డతో గొంతు కోయడమే : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు. రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, నయ వంచన, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులనేదే మోసమని, ఒకటే రాజధాని అని,ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని నర్సాపురం ఎంపీ చెప్పారు.
న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు.
అమరావతికి కట్టుబడి ఉన్నాం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని, రైతులకు మద్దతు ఇస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నిలబెట్టాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022