ఆంధ్రప్రదేశ్ :నివర్ తుపాన్తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పంట నష్టం పై సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు పై జగన్ సెటైర్లు వేసారు.
చంద్రబాబుకు పై కంపార్ట్ మెంట్ లో సెన్స్ లేదన్నారు జగన్. ముఖ్యమంత్రి ఉద్దేశంలో పై కంపార్ట్ మెంట్ అంటే బ్రెయిన్ అని అర్థం. "మాట్లాడేప్పుడు పై-కంపార్ట్ మెంట్ (బుర్ర)లో సెన్స్ ఉండాలి. ఎన్యుమరేషన్ (లెక్కింపు) ఓవైపు జరుగుతోంది. డిసెంబర్ 30 లోపు ఏ సీజన్ లో ఇవ్వాల్సిన ఇన్-పుట్ సబ్సిడీని అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. అంటే నెల తిరక్కముందే రైతుల చేతుల్లో డబ్బులు పెట్టబోతున్నాం. ఇంత చెబుతున్నా ఆయనకు (బాబు) అర్థం కావడం లేదు. పై కంపార్ట్ మెంట్ (బుర్ర)లో ఖాళీ స్థలం తప్ప ఏమీ లేదంటూ జగన్ సెటైర్లు వేసారు.
అనంతరం చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారానికి వాయిదా వేశారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
ఆంధ్రప్రదేశ్ :నివర్ తుపాన్తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పంట నష్టం పై సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు పై జగన్ సెటైర్లు వేసారు.
చంద్రబాబుకు పై కంపార్ట్ మెంట్ లో సెన్స్ లేదన్నారు జగన్. ముఖ్యమంత్రి ఉద్దేశంలో పై కంపార్ట్ మెంట్ అంటే బ్రెయిన్ అని అర్థం. "మాట్లాడేప్పుడు పై-కంపార్ట్ మెంట్ (బుర్ర)లో సెన్స్ ఉండాలి. ఎన్యుమరేషన్ (లెక్కింపు) ఓవైపు జరుగుతోంది. డిసెంబర్ 30 లోపు ఏ సీజన్ లో ఇవ్వాల్సిన ఇన్-పుట్ సబ్సిడీని అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. అంటే నెల తిరక్కముందే రైతుల చేతుల్లో డబ్బులు పెట్టబోతున్నాం. ఇంత చెబుతున్నా ఆయనకు (బాబు) అర్థం కావడం లేదు. పై కంపార్ట్ మెంట్ (బుర్ర)లో ఖాళీ స్థలం తప్ప ఏమీ లేదంటూ జగన్ సెటైర్లు వేసారు.
అనంతరం చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారానికి వాయిదా వేశారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021