ఆంధ్ర ప్రదేశ్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కీలక విషయాల గురించి చర్చించారు. స్కూల్స్ రీ ఓపెన్ విషయమై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తరించే ప్రమాదం ఉన్న నేపధ్యంలో ఏ జాగ్రత్తలతో స్కూళ్లను నడపాలన్న విషయమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. చదువుకు సంబంధించిన పథకాలు, భద్రత తదితర విషయాలపై కూడా కాబినెట్ చర్చించింది.
ఈ రోజు జరిగిన మీటింగ్ లో జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ ఆసరా పథకంకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే నెల ఐదు నుంచి జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోంది. మరోవైపు పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కూడా కాబినెట్ అంగీకారం తెలిపింది. సామజిక భద్రతా పధకం విషయమై వైఎస్ఆర్ బీమాకు కూడా క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనీ క్యాబినెట్ నిర్ణయించింది. కడప జిల్లాలో పోలీస్ శాఖకు బలం చేకూర్చడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని వార్తలు చదవండి ( ఈ నెల 16 నుంచి ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు..? )
ఆంధ్ర ప్రదేశ్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కీలక విషయాల గురించి చర్చించారు. స్కూల్స్ రీ ఓపెన్ విషయమై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తరించే ప్రమాదం ఉన్న నేపధ్యంలో ఏ జాగ్రత్తలతో స్కూళ్లను నడపాలన్న విషయమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. చదువుకు సంబంధించిన పథకాలు, భద్రత తదితర విషయాలపై కూడా కాబినెట్ చర్చించింది.
ఈ రోజు జరిగిన మీటింగ్ లో జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ ఆసరా పథకంకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే నెల ఐదు నుంచి జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోంది. మరోవైపు పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కూడా కాబినెట్ అంగీకారం తెలిపింది. సామజిక భద్రతా పధకం విషయమై వైఎస్ఆర్ బీమాకు కూడా క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనీ క్యాబినెట్ నిర్ణయించింది. కడప జిల్లాలో పోలీస్ శాఖకు బలం చేకూర్చడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని వార్తలు చదవండి ( ఈ నెల 16 నుంచి ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు..? )
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Apr 2021
20 Apr 2021
19 Apr 2021
21 Apr 2021