ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ హయాం అంతా అక్రమాల మయం అంటూ నమ్ముతున్న సీఎం జగన్ వాటి సంగతి ఎలాగైనా తేల్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏకంగా సీబీఐ నే రంగంలోకి దించాలని నిర్ణయించారు. గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . . గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్కమిటీ నివేదిక అందజేసింది. సబ్కమిటీ నివేదిక కేబినెట్ ముందు ఉంచింది. సబ్కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది.
వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్ట్ 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రామాయపట్నం పోర్టుకు కేంద్ర నిధులపై కూడా కేబినెట్లో చర్చించారు. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ నిధులు ఖర్చు చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ హయాం అంతా అక్రమాల మయం అంటూ నమ్ముతున్న సీఎం జగన్ వాటి సంగతి ఎలాగైనా తేల్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏకంగా సీబీఐ నే రంగంలోకి దించాలని నిర్ణయించారు. గురువారం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . . గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్కమిటీ నివేదిక అందజేసింది. సబ్కమిటీ నివేదిక కేబినెట్ ముందు ఉంచింది. సబ్కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది.
వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్ట్ 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రామాయపట్నం పోర్టుకు కేంద్ర నిధులపై కూడా కేబినెట్లో చర్చించారు. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ నిధులు ఖర్చు చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021