ఆంధ్ర ప్రదేశ్ : అనంతపురం జిల్లాలో ట్రెజరీలో పనిచేసే ఉద్యోగి మనోజ్ కారు డ్రైవర్ నాగలింగ ఇంట్లో భారీగా బంగారం, డబ్బు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకుని ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల మనోజ్ ఇంట్లోనిఖీలు నిర్వహించగా ఊహించని రీతిలో బంగారం, నగదు లభ్యమయ్యాయి. ఉద్యోగి మనోజ్ ఇంట్లో ఎనిమిది పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షల నగదు, రూ.27లక్షల విలువైన ప్రామిసరీనోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ఆరు బైక్లు, మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్లు, రూ.లక్షల విలువైన మరో ద్విచక్రవాహనం, నాలుగు ట్రాక్టర్లు, రెండు అత్యాధునిక కార్లను గుర్తించారు. స్థిరాస్తులపై అనంతపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ట్రెజరీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి మనోజ్ దగ్గర నాగలింగ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుక్కరాయసముద్రంలోని అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. 10 పురాతన ట్రంకు పెట్టెలు బయటపడ్డాయి. ఓ రివాల్వర్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఉద్యోగి మనోజ్తో పాటు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులు..!