ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లోను కరోనా విస్తృతంగా ప్రబలుతున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కొన్ని రోజుల పాటు ట్విట్టర్ లోను, ఫోన్ లోను అందుబాటులో ఉండనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప సంప్రదించొద్దని కోరారు. దాదాపు పది రోజుల పాటు ఆయన విశ్రాంతిగా ఉంటూ,చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకీ కరోనా సోకినా విషయం తెలియాగానే,ఆయన కోలుకోవాలని పలువురు ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు.
దాదాపు పది రోజుల తరువాత విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నానని తన పోస్ట్ ద్వారా తెలిపారు."భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను" అని విజయ సాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమం లో పోస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లోను కరోనా విస్తృతంగా ప్రబలుతున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కొన్ని రోజుల పాటు ట్విట్టర్ లోను, ఫోన్ లోను అందుబాటులో ఉండనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసరం అయితే తప్ప సంప్రదించొద్దని కోరారు. దాదాపు పది రోజుల పాటు ఆయన విశ్రాంతిగా ఉంటూ,చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకీ కరోనా సోకినా విషయం తెలియాగానే,ఆయన కోలుకోవాలని పలువురు ట్విట్టర్ మాధ్యమం ద్వారా స్పందించారు.
దాదాపు పది రోజుల తరువాత విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నానని తన పోస్ట్ ద్వారా తెలిపారు."భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను" అని విజయ సాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమం లో పోస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox