ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై పార్టీ నేతల్లో పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ క్రమశిక్షణనని పాటించడం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణమ్ రాజు సీఎం జగన్ కు ఇదివరకే ఓ లేఖ రాసారు.
తాజాగా అయోధ్య లో రామమందిరానికి భూమి పూజ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగష్టు ఐదవ తేదీ ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ నేపధ్యంలో ఆయన మరో సారి సీఎం జగన్ కు లేఖ రాసారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ ఆగష్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని ఆయన లేఖ లో పేర్కొన్నారు. అయోధ్య లో జరిగే భూమి పూజ సందర్భం గా రాష్ట్రములో అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని లేఖ ద్వారా రఘురామకృష్ణం రాజు జగన్ ను కోరారు. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలాగే అయోధ్యలో రామాలయం నిర్మాణకార్యక్రమం భూమి పూజ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయ నిర్మాణం అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై పార్టీ నేతల్లో పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ క్రమశిక్షణనని పాటించడం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణమ్ రాజు సీఎం జగన్ కు ఇదివరకే ఓ లేఖ రాసారు.
తాజాగా అయోధ్య లో రామమందిరానికి భూమి పూజ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగష్టు ఐదవ తేదీ ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ నేపధ్యంలో ఆయన మరో సారి సీఎం జగన్ కు లేఖ రాసారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ ఆగష్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని ఆయన లేఖ లో పేర్కొన్నారు. అయోధ్య లో జరిగే భూమి పూజ సందర్భం గా రాష్ట్రములో అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని లేఖ ద్వారా రఘురామకృష్ణం రాజు జగన్ ను కోరారు. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలాగే అయోధ్యలో రామాలయం నిర్మాణకార్యక్రమం భూమి పూజ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయ నిర్మాణం అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022