కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తమకు అవగాహన ఉందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుందని, దీనిపై కేంద్ర హోంశాఖ నిమగ్నమైందని న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం ఐబీ నివేదికలు రావాలని, వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు రెండు వారాల్లో దీనిపై ఏం చేశారనేది కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.
, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గతంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే కేంద్ర హోంశాఖకు కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఎంపీ రాఘురామకు తాము భద్రత కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో కోర్టు ద్వారా కేంద్రానికి ఆదేశాలు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రఘురామకృష్ణం రాజు కోర్టునే ఆశ్రయించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజుమీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. తనపై ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రే కేసులు పెట్టారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతోనే తనకు ఇబ్బంది ఉందని ఉందన్నారు. ఒక వేళ ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ కానున్నట్లు ఎంపీ రఘురామ చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఆయన సీఎం జగన్ కు పలు అంశాలపై లేఖలు రాస్తున్నారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్థానం రెండు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తమకు అవగాహన ఉందని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుందని, దీనిపై కేంద్ర హోంశాఖ నిమగ్నమైందని న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం ఐబీ నివేదికలు రావాలని, వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు రెండు వారాల్లో దీనిపై ఏం చేశారనేది కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.
, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గతంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే కేంద్ర హోంశాఖకు కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఎంపీ రాఘురామకు తాము భద్రత కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో కోర్టు ద్వారా కేంద్రానికి ఆదేశాలు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రఘురామకృష్ణం రాజు కోర్టునే ఆశ్రయించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజుమీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. తనపై ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రే కేసులు పెట్టారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతోనే తనకు ఇబ్బంది ఉందని ఉందన్నారు. ఒక వేళ ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ కానున్నట్లు ఎంపీ రఘురామ చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఆయన సీఎం జగన్ కు పలు అంశాలపై లేఖలు రాస్తున్నారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022