ఆంధ్రప్రదేశ్ : గుంటూరు జిల్లాలో రమావత్ మంత్రూబాయి అనే గిరిజన మహిళను ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. మృతురాలి బంధువులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఆందోళనకు దిగారు.నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపణలు చేసారు.
ఆరోపణలు ఎక్కువ కావడంతో పోలీసులు శ్రీనివాసరెడ్డి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. వీరు అటవీభూముల్లో సాగు చేసుకుంటూ ఆ భూమిలో రెండున్నర ఎకరాలపై హక్కులు సంపాదించుకున్నారు. అయితే,అవసరాల కోసం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
గత కొంత కాలంగా ఆ అప్పుని తీర్చాలంటూ వారి పై ఆ వడ్డీ వ్యాపారి శ్రీనివాస రెడ్డి వత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ఇద్దరికీ చాల సార్లు గొడవ కూడా జరిగింది. తన అప్పులు తీర్చకుండా పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్తున్నారని కోపంతో,శ్రీనివాస రెడ్డి ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. పొలానికి వెళుతున్న మంత్రూబాయి, మంత్రూనాయక్ లను తన ట్రాక్టరు తో అడ్డుకున్నాడు. అయితే గొడవ పెరగడంతో మంత్రుబాయిని ట్రాక్టరు తో తొక్కించాడు. దీనితో ఆమె అక్కడిక్కకడే మృతి చెందింది. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : గుంటూరు జిల్లాలో రమావత్ మంత్రూబాయి అనే గిరిజన మహిళను ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. మృతురాలి బంధువులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఆందోళనకు దిగారు.నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపణలు చేసారు.
ఆరోపణలు ఎక్కువ కావడంతో పోలీసులు శ్రీనివాసరెడ్డి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. వీరు అటవీభూముల్లో సాగు చేసుకుంటూ ఆ భూమిలో రెండున్నర ఎకరాలపై హక్కులు సంపాదించుకున్నారు. అయితే,అవసరాల కోసం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
గత కొంత కాలంగా ఆ అప్పుని తీర్చాలంటూ వారి పై ఆ వడ్డీ వ్యాపారి శ్రీనివాస రెడ్డి వత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ఇద్దరికీ చాల సార్లు గొడవ కూడా జరిగింది. తన అప్పులు తీర్చకుండా పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్తున్నారని కోపంతో,శ్రీనివాస రెడ్డి ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. పొలానికి వెళుతున్న మంత్రూబాయి, మంత్రూనాయక్ లను తన ట్రాక్టరు తో అడ్డుకున్నాడు. అయితే గొడవ పెరగడంతో మంత్రుబాయిని ట్రాక్టరు తో తొక్కించాడు. దీనితో ఆమె అక్కడిక్కకడే మృతి చెందింది. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 May 2022
25 May 2022
25 May 2022