ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అక్కడ హీట్ ను పుట్టిస్తోంది. ఈ విషయమై సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ సోమవారం హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే విచారణ చేయాలనీ, ఆలస్యం చేస్తే, కీలక సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన చెందారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయన హై కోర్ట్ కు విజ్ఞప్తి చేసారు. అయితే, ధర్మాసనం ఈ విషయమై మంగళవారం విచారణ చేపడతామని ప్రకటించిన సంగతి విదితమే.
నేడు హై కోర్ట్ లో ఈవిషయమై విచారణ జరిగింది. ఫోన్ టాపింగ్ ఆరోపణలపై దాఖలైన పిల్పై అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది సుమన్ ప్రభుత్వం తరఫున వాదించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం వల్ల జాతీయభద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఈ విషయమై కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడం కూడా, ఏపీ రాజకీయాల్లో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లయింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలంటే సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే, ఈ అంశాన్ని చూస్తే ఇదేదో చిన్న పిల్లల వ్యవహారంలాగా ఉంది. పైగా, ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టుగా ఏవో కధనాలు కూడా ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం..."మాకు తెలిసి ఏ హైకోర్టు జడ్జి కూడా ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతోనూ మాట్లాడలేదని నమ్ముతున్నామని" తెలిపింది. ఈ కథనం అంతా అసహనంతో నిండిన కథనంగా కోర్టు పేర్కొంది. చట్ట ధిక్కరణకు పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం కూడా పరువు నష్టం నోటీసును ఇచ్చింది. అయితే, ఈ కేసులో ఈ కధనాలు ప్రచురించిన మీడియా పై ఉచ్చు బిగుస్తోంది. ట్యాపింగ్ మీద వారికి ఎక్కడనుంచి సమాచారం వచ్చింది?, వారు ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో ఈ కోర్టుకు చెప్పాలని హై కోర్ట్ ఆదేశించింది. అంతే కాదు, జడ్జి కదలికలపై నిఘా పెట్టారంటూ ఒక సీనియన్ ఐపీఎస్ అదికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఈవివరాలను పొందుపరుస్తూ అఫడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అక్కడ హీట్ ను పుట్టిస్తోంది. ఈ విషయమై సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ సోమవారం హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే విచారణ చేయాలనీ, ఆలస్యం చేస్తే, కీలక సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన చెందారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయన హై కోర్ట్ కు విజ్ఞప్తి చేసారు. అయితే, ధర్మాసనం ఈ విషయమై మంగళవారం విచారణ చేపడతామని ప్రకటించిన సంగతి విదితమే.
నేడు హై కోర్ట్ లో ఈవిషయమై విచారణ జరిగింది. ఫోన్ టాపింగ్ ఆరోపణలపై దాఖలైన పిల్పై అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది సుమన్ ప్రభుత్వం తరఫున వాదించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం వల్ల జాతీయభద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఈ విషయమై కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడం కూడా, ఏపీ రాజకీయాల్లో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లయింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలంటే సమాచారం ఏ సోర్స్ నుంచి వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే, ఈ అంశాన్ని చూస్తే ఇదేదో చిన్న పిల్లల వ్యవహారంలాగా ఉంది. పైగా, ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టు జడ్జి మీడియాతో మాట్లాడినట్టుగా ఏవో కధనాలు కూడా ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం..."మాకు తెలిసి ఏ హైకోర్టు జడ్జి కూడా ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏ మీడియా సంస్థతోనూ మాట్లాడలేదని నమ్ముతున్నామని" తెలిపింది. ఈ కథనం అంతా అసహనంతో నిండిన కథనంగా కోర్టు పేర్కొంది. చట్ట ధిక్కరణకు పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం కూడా పరువు నష్టం నోటీసును ఇచ్చింది. అయితే, ఈ కేసులో ఈ కధనాలు ప్రచురించిన మీడియా పై ఉచ్చు బిగుస్తోంది. ట్యాపింగ్ మీద వారికి ఎక్కడనుంచి సమాచారం వచ్చింది?, వారు ఈ కథనాన్ని ఎలా రాశారు? వారితో జడ్జి మాట్లాడి ఉంటే ఏం చెప్పారో ఈ కోర్టుకు చెప్పాలని హై కోర్ట్ ఆదేశించింది. అంతే కాదు, జడ్జి కదలికలపై నిఘా పెట్టారంటూ ఒక సీనియన్ ఐపీఎస్ అదికారి చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. ఈవివరాలను పొందుపరుస్తూ అఫడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
23 Jan 2021