ఆంధ్రప్రదేశ్ :ఏపీలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీనియర్ లాయర్ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు విచారణకు స్వీకరించింది.చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ శ్రవణ్, ప్రభుత్వానికి మధ్య వాదనలు జరిగాయి. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో ఆంధ్రజ్యోతిని కూడా పార్టీగా చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
అఫిడవిట్లో ఉన్న కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. కథనంలో ఏముందో అడిగి తెలుసుకుంది. ఐదుగురు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని, ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా, తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్ డైరెక్టర్ ద్వారా టెలికమ్యునికేషన్ నిపుణులతో తక్షణం కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
అన్ని వివరాలతో అఫిడవిట్ను ఫైల్ చేయాలని శ్రవణ్ను ధర్మాసనం ఆదేశించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ, ఆరోజే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
మరిన్ని వార్తలు చదవండి.