ఆంధ్రప్రదేశ్ :విజయవాడ వాసుల చిరకాల స్వప్నం
దుర్గగుడి ఫ్లై ఓవర్ను సెప్టెంబర్ 4న విజయవాడ ప్రారంభించబోతున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి ఫ్లై ఓవర్ పనులను తనిఖీ చేసిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని చిన్న చిన్న పనులను ముగించి వచ్చే నెల 4న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఆరోజు ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్కు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు. ఒక వైపు సంక్షేమం. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.