ఆంధ్రప్రదేశ్ :రాష్ట్రము లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానిని బాబు కోరారు. ఫోన్ ట్యాపింగ్ వలన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, దీని కారణం చేత ప్రజాస్వామ్య వ్యవస్థలే నాశనం అవుతాయని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని లేఖలో తెలిపారు.ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్ చేయడం వలన ముప్పు ఉందని, దేశ భద్రతకే ఇది పెను ప్రమాదమని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
వైసీపీ పాలనా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేసారని చంద్రబాబు నాయుడు పలు ఆరోపణలు గుప్పించారు. పాలనా ప్రక్రియ పూర్తిగా గాడి తప్పిందని.. ఏపీ ప్రభుత్వం పై తగు చర్యలు తీసుకోవాలని ప్రధానిని బాబు లేఖ ద్వారా కోరారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ :రాష్ట్రము లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానిని బాబు కోరారు. ఫోన్ ట్యాపింగ్ వలన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, దీని కారణం చేత ప్రజాస్వామ్య వ్యవస్థలే నాశనం అవుతాయని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని లేఖలో తెలిపారు.ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్ చేయడం వలన ముప్పు ఉందని, దేశ భద్రతకే ఇది పెను ప్రమాదమని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
వైసీపీ పాలనా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేసారని చంద్రబాబు నాయుడు పలు ఆరోపణలు గుప్పించారు. పాలనా ప్రక్రియ పూర్తిగా గాడి తప్పిందని.. ఏపీ ప్రభుత్వం పై తగు చర్యలు తీసుకోవాలని ప్రధానిని బాబు లేఖ ద్వారా కోరారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox