ఆంధ్రప్రదేశ్ :ఆగష్టు ఐదవ తేదీ రామ జన్మ భూమి అయినా అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. యావత్ భారతం ఆ క్షణం కోసం ఉత్కంఠ గా ఎదురుచూసింది. దాదాపు అన్ని టీవీ న్యూస్ చానెల్స్ భూమి పూజ కార్యక్రమాన్ని లైవ్ లో చూపించాయి.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో టీటీడీ మాత్రం ఈ అపురూప ఘట్టాన్ని ప్రసారం చేయలేదు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదని ఆయన టీటీడీ ని ప్రశ్నించారు. దాదాపు, 250 ఛానళ్ళు అయోధ్య ఘట్టాన్ని గంటలపాటు ప్రత్యక్ష ప్రసారం చేశాయని, టీటీడీ ఛానల్ మాత్రం ఎందుకు ప్రసారం చేయలేదని ఆయన ప్రశ్నలు కురిపించారు.
ముఖ్యమంత్రి విశాఖలో శారదాపీఠం కు వెళితే.. అక్కడి ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ యావత్ భారతీయులు ఎదురు చుస్తే, అయోధ్య ఘట్టాన్ని మాత్రం ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. దీనికి బాధ్యులపై ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పందించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ :ఆగష్టు ఐదవ తేదీ రామ జన్మ భూమి అయినా అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. యావత్ భారతం ఆ క్షణం కోసం ఉత్కంఠ గా ఎదురుచూసింది. దాదాపు అన్ని టీవీ న్యూస్ చానెల్స్ భూమి పూజ కార్యక్రమాన్ని లైవ్ లో చూపించాయి.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో టీటీడీ మాత్రం ఈ అపురూప ఘట్టాన్ని ప్రసారం చేయలేదు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదని ఆయన టీటీడీ ని ప్రశ్నించారు. దాదాపు, 250 ఛానళ్ళు అయోధ్య ఘట్టాన్ని గంటలపాటు ప్రత్యక్ష ప్రసారం చేశాయని, టీటీడీ ఛానల్ మాత్రం ఎందుకు ప్రసారం చేయలేదని ఆయన ప్రశ్నలు కురిపించారు.
ముఖ్యమంత్రి విశాఖలో శారదాపీఠం కు వెళితే.. అక్కడి ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ యావత్ భారతీయులు ఎదురు చుస్తే, అయోధ్య ఘట్టాన్ని మాత్రం ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. దీనికి బాధ్యులపై ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పందించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 May 2022
25 May 2022
25 May 2022