ఆంధ్రప్రదేశ్ : విజయవాడ స్వర్ణ పాలస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీలను నియమించింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం. ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం లో కరోనా రోగులను ఐసోలేషన్ లో ఉంచడం వంటి తప్పిదాలతో ప్రమాదం జరిగింది. అయితే, మరింత లోతుగా పరిశీలించి చుస్తే, చాలా ఆసుపత్రిలకు సరైన భద్రతా ప్రమాణాలు ఉండడం లేదు.
కృష్ణా జిల్లాలో 83 శాతం ఆసుపత్రులకు అసలు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. తాజా వివరాల ప్రకారం కృష్ణా జిల్లాలో 1,018 వరకు ఆసుపత్రులు ఉండగా వాటిలో 840 ఆసుపత్రులకు ( 83 శాతం)అగ్నిమాపక శాఖ అనుమతులు (NOC) (NOC -No Objection Certificate ) లేవు. విజయవాడ స్వర్ణ పాలస్ లో జరిగిన ఘటనతో ఆసుపత్రుల్లో కరోనా రోగుల భద్రత విషయమై చర్చ మొదలైంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నా, చితక ఆసుపత్రులు డెంటల్ క్లినిక్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, తదితరాలు కలిపి 1,018 వరకు ఉండగా,వీటిలో 88 ప్రభుత్వ ఆసుపత్రులు మరో 90 ఇతర ఆసుపత్రులు మినహాయిస్తే, మిగిలిన వాటికి అనుమతులు లేవు.
ప్రభుత్వ ఆసుపత్రులు మినహాయిస్తే పడకలు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, 25 పడకల లోపు ఆపై ఉన్న పడకల ఆసుపత్రుల మొత్తం 930 ఉండగా వీటిలో 90 ఆసుపత్రులకు మాత్రమే అగ్నిమాక శాఖ ఎన్వోసీలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రులు అసలు అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కూడా చేయడం లేదు. చాల వాటిల్లో ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు, పంపులు లేవు. 50 శాతం ఆసుపత్రులు మాత్రమే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేటసన్లను సమకూర్చుకున్నాయి. కృష్ణా జిలాల్లో ఉన్న మొత్తం ఆసుపత్రుల్లో 25 పడకలలోపు ఉన్నవి 393 ,25 ఆపై పడకలు ఉన్నవి 121 ,పడకలు లేని క్లినిక్లు 416 , ప్రభుత్వ పీహెచ్సీలు - 88 . మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : విజయవాడ స్వర్ణ పాలస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీలను నియమించింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం. ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం లో కరోనా రోగులను ఐసోలేషన్ లో ఉంచడం వంటి తప్పిదాలతో ప్రమాదం జరిగింది. అయితే, మరింత లోతుగా పరిశీలించి చుస్తే, చాలా ఆసుపత్రిలకు సరైన భద్రతా ప్రమాణాలు ఉండడం లేదు.
కృష్ణా జిల్లాలో 83 శాతం ఆసుపత్రులకు అసలు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. తాజా వివరాల ప్రకారం కృష్ణా జిల్లాలో 1,018 వరకు ఆసుపత్రులు ఉండగా వాటిలో 840 ఆసుపత్రులకు ( 83 శాతం)అగ్నిమాపక శాఖ అనుమతులు (NOC) (NOC -No Objection Certificate ) లేవు. విజయవాడ స్వర్ణ పాలస్ లో జరిగిన ఘటనతో ఆసుపత్రుల్లో కరోనా రోగుల భద్రత విషయమై చర్చ మొదలైంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నా, చితక ఆసుపత్రులు డెంటల్ క్లినిక్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, తదితరాలు కలిపి 1,018 వరకు ఉండగా,వీటిలో 88 ప్రభుత్వ ఆసుపత్రులు మరో 90 ఇతర ఆసుపత్రులు మినహాయిస్తే, మిగిలిన వాటికి అనుమతులు లేవు.
ప్రభుత్వ ఆసుపత్రులు మినహాయిస్తే పడకలు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, 25 పడకల లోపు ఆపై ఉన్న పడకల ఆసుపత్రుల మొత్తం 930 ఉండగా వీటిలో 90 ఆసుపత్రులకు మాత్రమే అగ్నిమాక శాఖ ఎన్వోసీలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రులు అసలు అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కూడా చేయడం లేదు. చాల వాటిల్లో ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు, పంపులు లేవు. 50 శాతం ఆసుపత్రులు మాత్రమే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేటసన్లను సమకూర్చుకున్నాయి. కృష్ణా జిలాల్లో ఉన్న మొత్తం ఆసుపత్రుల్లో 25 పడకలలోపు ఉన్నవి 393 ,25 ఆపై పడకలు ఉన్నవి 121 ,పడకలు లేని క్లినిక్లు 416 , ప్రభుత్వ పీహెచ్సీలు - 88 . మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Apr 2021
14 Apr 2021
11 Apr 2021
20 Apr 2021