ఆంధ్రప్రదేశ్ : ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాజధానుల అంశమే కాకుండా సీఆర్డీఏ బిల్లుకి కూడా గవర్నర్ వద్ద నుంచి లైన్ క్లియర్ అయింది. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది.ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు పై ఎప్పటి నుంచో అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
మొదటి సారి వైసీపీ బిల్లు ప్రతిపాదించినపుడు శాసన సభ ఆమోదం తెలిపింది. మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. మూడు నెలల తరువాత ఆ బిల్ మండలి కి పంపబడింది.. మండలి లో టీడీపీ పార్టీ ఈ బిల్లుని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీ వద్ద ఈ బిల్లు కు బ్రేకులు పడ్డాయి.. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్కు పంపింది. ఈ పరిస్థితిల్లో గవర్నర్ నిర్ణయం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.
తాజాగా గవర్నర్ ఆమోదించడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. ఇక నుంచి ఆంద్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయి. పరిపాల వికేంద్రీకరణ దిశా గా కొనసాగుతోంది. మరో వైపు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి.. టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు చట్టాన్ని ఏర్పాటు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇపుడు ఆ చట్టం ప్రకారమే రాజధానిని విశాఖ కు తరలిస్తారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తో జగన్ సర్కార్ ఫుల్ ఖుషి లో ఉంది. మరిన్ని వార్తలు చదవండి.
ఆంధ్రప్రదేశ్ : ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాజధానుల అంశమే కాకుండా సీఆర్డీఏ బిల్లుకి కూడా గవర్నర్ వద్ద నుంచి లైన్ క్లియర్ అయింది. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది.ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు పై ఎప్పటి నుంచో అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
మొదటి సారి వైసీపీ బిల్లు ప్రతిపాదించినపుడు శాసన సభ ఆమోదం తెలిపింది. మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. మూడు నెలల తరువాత ఆ బిల్ మండలి కి పంపబడింది.. మండలి లో టీడీపీ పార్టీ ఈ బిల్లుని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు పాస్ కాలేదు. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అనంతరం, ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీ వద్ద ఈ బిల్లు కు బ్రేకులు పడ్డాయి.. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్కు పంపింది. ఈ పరిస్థితిల్లో గవర్నర్ నిర్ణయం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.
తాజాగా గవర్నర్ ఆమోదించడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. ఇక నుంచి ఆంద్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయి. పరిపాల వికేంద్రీకరణ దిశా గా కొనసాగుతోంది. మరో వైపు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి.. టీడీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు చట్టాన్ని ఏర్పాటు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇపుడు ఆ చట్టం ప్రకారమే రాజధానిని విశాఖ కు తరలిస్తారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తో జగన్ సర్కార్ ఫుల్ ఖుషి లో ఉంది. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 May 2022
26 May 2022
26 May 2022
26 May 2022