AndhraPradesh: ఈ ఏడాది మార్చి నెలలోనే రికార్డు స్దాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. సహజంగానే వేసవికాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగానే వుంటుంది. తాజాగా వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్లో నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్కు ఓ రైతు తెచ్చిన నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.
రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య అమ్మతుండటం విశేషం.
AndhraPradesh: ఈ ఏడాది మార్చి నెలలోనే రికార్డు స్దాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. సహజంగానే వేసవికాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగానే వుంటుంది. తాజాగా వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్లో నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్కు ఓ రైతు తెచ్చిన నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.
రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య అమ్మతుండటం విశేషం.
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022